కరోనా మహమ్మారి వలన అన్ని రంగాల వ్యాపారాలకు గండి పడింది. తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమ కూడా చాలా వరకు నష్టపోయిందని చెప్పొచ్చు. సినీ నిర్మాతలు పెద్ద సినిమాలను పండుగలకు విడుదల చేయాలని అన్నింటినీ సిద్ధంగా ఉంచుకున్నారు, కానీ ఈ మహమ్మారి వలన సినిమాలు ఏవీ థియేటర్లలో విడుదలకాలేదు. దీనివలన నిర్మాతలపై వడ్డీల భారం భారీగా పడింది. ఇప్పటికీ మహమ్మారీ భయాందోళనలు సినిమా ఇండస్ట్రీని వదలలేదు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలు ఒకటి రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అయితే, మరొకటి కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమా.   కాగా ఇటీవలే ఎస్.ఎస్.రాజమౌళి సహా పలువురు టాప్ సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్ రావడం అనంతరం చికిత్స ద్వారా కోలుకోవడం తెలిసినదే.

కరోనా వైరస్ ఎవరినీ వదిలి పెట్టదన్న ఆందోళన అలానే ఉండిపోయింది. ఇక ఏజ్ దృష్ట్యా కూడా పలువురు స్టార్ హీరోల్ని ఆందోళన విడిచిపెట్టడం లేదు. 60 ప్లస్ లో ఇప్పుడున్న పరిస్థితిలో రిస్క్ చేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అందుకే నెమ్మదిగా షూటింగుల విషయమై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఆచార్యలో హీరో గా నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (65) కూడా కరోనా వైరస్ విషయంలో చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నారు. అయితే కొరటాల శివ ఆచార్య ఫ్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా కరోనా కారణంగా ఇంకా కొన్ని రోజులు వేచి చూసే ఆలోచనలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. తొలుత టెస్ట్ షూట్ చేశాకే చిరుని సెట్స్ కి ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారట. అలాగే చిరు-చరణ్ కాంబినేషన్ చిత్రీకరణలకు సంబంధించిన ప్రత్యేకించి కేర్  తీసుకోనున్నారని తెలిసింది.

రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం సైతం ఇలానే టెస్ట్ షూట్లు చేశారు. దాని తర్వాత మొన్ననే షూటింగును కూడా ప్రారంభించారు. ఇప్పుడు అదే బాటలో కొరటాల అండ్ టీమ్ కూడా కేర్ తీసుకుంటున్నారు. ఇదే బాటలో కొరటాల శివ కూడా ముందుగా టెస్ట్ శూరులు చేసి తరువాతనే మెయిన్ షూటింగ్ చేయనున్నారు. . అంతేకాకుండా అందాల కాజల్ అక్టోబర్ 30 న వివాహం చేసుకోనున్న సంగతి విధితమే. తను నవంబర్ చివరి వారం నుండి కాల్షీట్లను కేటాయించింది. దసరా తరువాత టెస్ట్ షూట్ ప్రారంభించి ఒక వారం పాటు కొనసాగిస్తారట. అనంతరం చిరంజీవి కూడా సెట్స్ లో జాయిన్ అవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభమయ్యి మనముందుకు రావాలని కోరుకుందాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: