ఈ ఏడాదికి అల్లు అర్జున్ తో అల వైకుంఠ పురములో సినిమాతో ఏకంగా ఇండ్రస్టీ హిట్ సాధించి మళ్ళీ నంబర్ వన్ రేసులోకి వచ్చేసాడు ఈ మాటల మాంత్రికుడు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కరోనా ప్రభావం వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో, అతి త్వరలో మళ్ళీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక తాజాగా ఒక్కొక్క హీరో కరోనా పరిస్థితులని ఎదురించి షూటింగ్స్ కి బయలుదేరుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr షూటింగ్ లో రామ్ చరణ్ కన్నా ముందు ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట.

 రాజమౌళి సినిమాతో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా చెయ్యాల్సి ఉంది.ఎన్టీఆర్ rrr మూవీలో నటించడం, తివిక్రమ్ కి అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి.ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం. అయితే ఈ చిత్రం గురించి ఓ లేటెస్ట్ అప్‌డేట్ బయటకు వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో అరవింద సమేతను తీసిన త్రివిక్రమ్‌, ఈసారి చేయబోయే చిత్రానికి అమెరికా నేపథ్యం ఎంచుకున్నారట. కుటుంబ విలువలతో పాటు పాశ్చాత్య అంశాలకు చిత్రకథలో త్రివిక్రమ్‌ చోటు కల్పించారట.

 ఇక వచ్చే ఏడాదే ఈ చిత్రం సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. మొత్తానికి ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో త్రివిక్రమ్ భారీ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు.అమెరికాలో పుట్టి పెరిగిన ఎన్టీఆర్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇండియా కి వస్తాడని అక్కడ ఎన్టీఆర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది కుటుంబ విలువలతో పాటు రాజకీయ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాడట త్రివిక్రమ్. ప్రస్తుతం త్రివిక్రమ్సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసాడని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: