టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో రష్మీకా మందన్నా ఒకరు. తెలుగులో ఛలో సినిమాతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు, ఆ సినిమాలో తన అందం, అమాయకత్వంతో అందరిని ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీతా గోవిందం సినిమాతో అందరి దృష్టినీ తన వైపుకు తిప్పుకుంది. అక్కడితో ఆమె దశ తిరిగింది. ఏకంగా అగ్ర హీరోల సరసన నటిస్తూ, ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఈ భామ ఒక్కో సినిమాకు కోటి రూపాయల పారితోషకం తీసుకుంటుంది. ఇదిలా ఉంటె ఈమె ఇటు సినిమాలతో పాటు తన ఫిజిక్ విషయంలో కూడాఎంతగానో కష్టపడుతుంది.  గత కొన్ని రోజులుగా రష్మిక తన వార్కౌట్స్ వీడియోలను, ఫోటోలను సామాజిక మధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.

 అభిమానులతో ఎప్పటికప్పుడు చాలా విషయాలు పంచుకుంటున్నారు.ఇటీవల సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో మంచి హిట్లు అందుకున్న రష్మిక.. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. రష్మిక తాజాగా క్రేజీ రికార్డ్‌ను అందుకుంది. అతి తక్కువ మంది హీరోయిన్స్ మాత్రమే దక్కించుకున్న కోటి మంది ఫాలోవర్స్ సంఖ్యను రష్మిక కూడా సొంతం చేసుకుంది. తాజాగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య 10 మిలియన్ ల మార్క్ క్రాస్ అయింది.

అయితే చాలా తక్కువ సమయంలోనే రష్మిక పది మిలియన్ల ఫాలోవర్స్‌ను వెనకేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళం, కన్నడంలో కూడా రష్మిక వరుసగా సినిమాలు చేస్తోంది. ఈ భాషల్లో కూడా ఆమె ఎందరో అభిమానులు ఉన్నారు. అందుకే ఆమెకు ఈ స్థాయి ఫాలోవర్స్ దక్కారని అంటున్నారు. దీన్ని బట్టి టాలీవుడ్ లో రష్మీకకు ఎలాంటి క్రేజ్ ఉందో  స్పష్టం అవుతోంది..ఈఇక ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా ఓ గెస్ట్ రోల్ లో నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: