యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రాధాకృష్ణ కుమార్ ని టార్గెట్ చేశారు. ఈ దర్శకుడికి ఓ స్ట్రాటజీ లేదనీ.. ప్రభాస్ ఇమేజ్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడని విమర్శిస్తున్నారు. మా డార్లింగ్ కు అసలు డైరెక్టర్లే దొరకలేదా.. ఎందుకిలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనీ.. బాధపడుతున్నారు.

ప్రభాస్ పుట్టిన రోజుకి రాధే శ్యామ్ ఎనౌన్స్ చేసిన ట్రీట్ పై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అసలు డార్లింగ్ బర్త్ డేను ఇలాగేనా సెలబ్రేట్ చేసుకునేది.. మీకు ఒక స్ట్రాటజీ లేదు.. ఒక ప్లానింగ్ లేదు.. ఇలాంటి వాళ్లంతా కలిసి మా హీరోను ముంచేస్తున్నారని బాధపడుతున్నారు అభిమానులు. రాజమౌళితో పోల్చుతూ.. రాధాకృష్ణ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారు.

రాజమౌళి హీరోల బర్త్ డేలను ఫుల్ గా వాడుకుంటున్నాడు. బర్త్ డే టీజర్స్ తో ట్రిపుల్ ఆర్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. రాధాకృష్ణ మాత్రం మోషన్ పోస్టర్లు, అదీ ఇదీ అని రాధేశ్యామ్ పై ఉన్న మంచి ఒపినీయన్ ను కూడా చంపేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ బర్త్ డే ను కూడా సరిగా ఉపయోగించుకోకపోతే ఎలా అని విమర్శిస్తున్నారు.

మోషన్ పోస్టర్ ఎనౌన్స్ మెంట్ తో ప్రభాస్ పై కామెంట్ చేస్తున్నారు అభిమానులు. బాహుబలి తర్వాత ఒక్క అనుభవం ఉన్న సుజిత్ తో సాహో చేశాడు. అది కాస్తా షాక్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఒక్క సినిమా అనుభవం ఉన్న రాధాకృష్ణ కుమార్ తో రాధేశ్యామ్ చేస్తున్నాడు. ఇతను మాత్రం సినిమాను సరిగా ప్రమోట్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి వాళ్లతో సినిమాలు చేసి మావాడేం సాధిస్తాడు అని కామెంట్ చేస్తున్నారు డార్లింగ్ డైహాడ్ ఫ్యాన్స్.

మొత్తానికి రాధేశ్యామ్ డైరెక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ విమర్శల జల్లు కురిపిస్తున్నారు. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ ఏంటో.. ఆయనకు అర్థం కానట్టుంది అని కామెంట్ లు చేస్తున్నారు. లేకపోతే రాధేశ్యామ్ సినిమాను ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రమోట్ చేసుకోవచ్చు కదా అని విమర్శిస్తున్నారు. అది కూడా రాధాకృష్ణకు చేతకాదా అని కామెంట్ లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: