ఆరెక్స్ 100 సినిమాతో డైరక్టర్ గా తన సత్తా చాటిన అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా మహా సముద్రం అని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా కథను చాలామంది దర్శకుల దగ్గరకు తీసుకెళ్లగా ఫైనల్ గా శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి రావు హైదరి నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో ముందు నాని గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు.

అయితే సినిమాలో నటించేందుకు గాను ప్రియాంకా 75 లక్షల దాకా పారితోషికం అడిగిందని తెలుస్తుంది. తెలుగులో కేవలం ఒక సినిమానే చేసిన ప్రియాంకా ఆ సినిమాతో కూడా హిట్ దక్కించుకోలేదు. అలాంటి అమ్మడు 75 లక్షలు డిమాండ్ చేయడంతో ఆమెని కాదని అదితి రావు హైదరిని హీరోయిన్ గా ఫిక్స్ చేసుకున్నారు. అదితి రావు హైదరి తన అభినయం ఆకట్టుకునేలా ఉన్నా సరైన కథలు పడక వెనకపడుతుంది.

గ్యాంగ్ లీడర్ భామ మాత్రం రెమ్యునరేషన్ కోసం ఓ మంచి సినిమా మిస్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి చేస్తున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ లో ఎన్నో సర్ ప్రైజులు ఉన్నట్టు తెలుస్తుంది. తప్పకుండా సినిమా అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు. మరి అజయ్ భూపతి ఏం చేస్తాడో చూడాలి.                                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: