బిగ్ బాస్ సీజన్ 4 నుండి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యాడు. చివరి వరకు కుమార్ సాయి, మోనాల్ లో ఒకరు ఎలిమినేట్ అవుతారని సస్పెన్స్ లో ఉంచిన నాగార్జున. ఇద్దరిని కన్ఫెషన్ రూం లోకి రమ్మని చెప్పి అక్కడ నుండి కుమార్ సాయిని స్టేజ్ మీదకు రమ్మని చెప్పాడు. సో అలా సాయి కుమార్ ఎలిమినేషన్ కన్ ఫాం చేశారు నాగార్జున. కుమార్ సాయి ఎలిమినేషన్ పై ఆడియెన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే మోనాల్ కన్నా డెఫినెట్ గా కుమార్ సాయి మంచి ఆటగాడే.

హౌజ్ లో మోనాల్ అఖిల్ కు హగ్గులివ్వడం తప్ప ఆట ఆడింది ఏమి లేదు. అయితే ఆడియెన్స్ కు అలాంటి స్టఫ్ కావాలని మోనాల్ ను సేవ్ చేసి కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారు. ఈ సీజన్ లోనే దేవి నాగవల్లి విషయంలో ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. అప్పటివరకు మెహబూబ్ ఎలిమినేట్ అనుకోగా ఫైనల్ గా దివిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత మెహబూబ్ స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారాడు. ఇక ఇప్పుడు కుమార్ సాయి కూడా ఇప్పుడిప్పుడే హౌజ్ లో స్ట్రాంగ్ గా మారుతున్న టైం లో ఎలిమినేట్ అయ్యాడు.

కుమార్ సాయి హౌజ్ నుండి ఎలిమినేట్ అవడంపై ఆడియెన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. బిగ్ బాస్ నిజంగానే ఓట్ల దాకా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుందా లేక బిగ్ బాస్ టీం తీసుకుంటున్న నిర్ణయం ప్రకరంగా ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుందా అని డౌట్ పడుతున్నారు.                                                                      

మరింత సమాచారం తెలుసుకోండి: