సినిమా షూటింగులకు ఇపుడు కాని కాలమే నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇది కరోనా కాలం. కాలు తీసి బయట పెట్టాలంటే పది సార్లు ఆలోచించాల్సిన కాలం. కానీ రెబెల్ స్టార్ ప్రభాస్ డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. కరోనా పీక్స్ కి చేరి విలయతాండవం చేసిన ఇటలీలోనే తన తాజా చిత్రం రాధేశ్యామ్  షూటింగ్ కి రెడీ అయిపోయాడు. మొత్తం చిత్ర యూనిట్ తో కలసి పదిహేను రోజుల పాటు షూట్ చేసేందుకు అక్కడకు వెళ్ళాడు. ఈ సినిమా హీరోయిన్ పూజా హెగ్డే ఇటలీ అనుభవాలను చెబుతూ కొంత భయానికి లోనయ్యారు.

కరోనా ఈ ఏడాది ప్రధమార్ధంలో విజృంభించినపుడు  ఇటలీ చాలా భయానకమైన వాతావరణాన్ని చూసింది. రోడ్ల మీదనే జనం చనిపోతూ కనిపించారు. ఎక్కడ చూసినా శవాల గుట్టలు దర్శనం ఇచ్చాయి. ఈ నేపధ్యంలో ఇటలీ అంటేనే అందరికీ వణుకు పుట్టింది. తెలిసి తెలిసి ఎవరూ ఇటలీ ఇంత త్వరగా వెళ్లే సాసహం కూడా చేయరు. కానీ మార్చిలో కరోనా నేపధ్యంలో  లాక్ డౌన్ కు ముందు   ప్రభాస్ రాధేశ్యామ్  షూటింగ్ అక్కడ కొంత జరుపుకుని వెనక్కి వచ్చేసింది. ఇపుడు మిగిలిన షూటింగ్ కోసమే ప్రభాస్ మళ్ళీ ఇంటలీ ప్రయాణం కట్టారు.

నిజానికి దాని కోసం లోకల్ గా సెట్స్ వేసి తీయాలనుకున్నా ఆ ఫీల్ రాదు అన్న ఉద్దేశ్యంతోనే ప్రభాస్ అసలు రాజీ పడలేదు అంటారు. కానీ ఇటలీలో ఇప్పటికీ  కరోనా పెద్ద ఎత్తున ఉందని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. తాను షూటింగునకు వెళ్ళిన మొదట కొన్ని రోజులు చాలా భయపడిపోయానని కూడా ఆమె చెపారు. అయితే ఆ తరువాత మాత్రం తామంతా తేరుకుని షూట్ చేస్తున్నామని ఆమె వివరించారు. షాట్ లేకపొతే తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని కూడా ఆమె చెప్పారు. ఇక లోకేషన్ లో ప్రతీ వారు కరోనా టెస్టులు చేయించుకోవాల్సిందేనని కూడా ఆమె తెలిపారు. మొత్తం మీద చూసుకుంట కత్తి మీద సాము మాదిరిగా కరోనా మీద సాము చేస్తూ ఇటలీలో షూట్ చేస్తున్నారు అన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: