ఇందులో ఏమాత్రం నిజం ఉందో లేదో తెలీదు కానీ ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం దెబ్బకి ఏకంగా బావా బామ్మరిదికి చెడిందని ప్రచారం మొదలయింది. నిజానికి చిరంజీవి 150వ సినిమాని అల్లు అరవింద్ తన నిర్మాణంలోనే మొదలు పెట్టాలనుకున్నా రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించడం, గీతా ఆర్ట్స్ ని పక్కనపెట్టడంతో అప్పటి నుండే తేడా వచ్చిందని అంటున్నారు.
అందుకే అప్పటి నుంచి రెండు ఫ్యామిలీల మధ్య ఏదో జరుగుతోందని అంటున్నారు. ఇప్పుడు ఈ స్టుడియోస్ విషయంలో అది బయట పడిందని అంటున్నారు. నిజానికి చిరుకి స్టూడియో నిర్మించాలని ఎప్పటి నుంచో ఉంది. విశాఖ తీరంలో చిరంజీవి వంద ఎకరాలు కొనుగోలు చేసి అక్కడే స్టూడియో నిర్మిస్తారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.