ఎంతైనా ఎక్స్ పీరియన్స్ ఎక్స్ పీరియన్సే. అనుభవాన్ని మించిన గురువు లేడు అంటారు. ఈ అనుభవంతోనే తెలుగు మేకర్స్ ని కరెక్ట్ గా లాక్ చేస్తున్నారు మాజీ హీరోయిన్లు. సిట్యువేషన్ ని కరెక్ట్ గా సొమ్ము చేసుకుంటున్నారు. యంగ్ బ్యూటీస్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.

విజయశాంతి రీఎంట్రీ కోసం టాలీవుడ్ చాలా రోజులు ఎదురు చూసింది. పాలిటిక్స్ లోకి వెళ్లిపోయిన రాములమ్మను మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని చాలామంది ప్రయత్నించారు. ఫైనల్ గా అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు. సరిలేరు నీకెవ్వరులో ప్రొఫెసర్ భారతిగా నటించింది. ఇక ఈ క్రేజీకి తగ్గట్టుగానే విజయశాంతికి కోటిన్నర వరకు పారితోషికం ఇచ్చారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురములో. ఈ మూవీలో బన్ని కన్న తల్లిగా నటించింది టబు. హిందీలో అంధాదున్, దేదే ప్యార్ దే లాంటి హిట్స్ తో స్వింగ్ లో ఉన్న టబుకు రెండున్నర కోట్ల వరకు ఇచ్చిన మళ్లీ టాలీవుడ్ కు తీసుకొచ్చారట దర్శకనిర్మాతలు. ఇక ీ సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డేకు కోటిన్నర మాత్రమే దక్కిందట. అంటే పూజా కంటే టబుకే కోటి రూపాయలు ఎక్కువ దక్కాయని చెప్పొచ్చు.

పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా మారిన మాజీ హీరోయిన్ రమ్యకృష్ణ, శివగామి దేవిగా సౌత్ నుంచి నార్త్ వరకు సూపర్ పాపులారిటీ సాధించిన రమ్యకృష్ణ, ఈ ఫేమ్ ని పర్ ఫెక్ట్ గా వాడుకుంటోందట. డే వైజ్ గా ఛార్జ్ చేస్తోన్న రమ్యకృష్ణ రోజుకి 5 నుంచి 10లక్షల వరకు తీసుకుంటోందట. మొత్తంగా ఒక సినిమాకు కోటికిపైగానే పుచ్చుకుంటోందని టాక్.

హీరోయిన్ గా రిటైర్ అయ్యాక అక్క, వదిన పాత్రలకు షిఫ్ట్ అయిన భూమిక కూడా భారీగానే డిమాండ్ చేస్తోందని సమాచారం. ఎమ్.సి.ఎ,. సినిమాలో నానికి వదినగా నటించి మెప్పించిన భూమిక రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని సమాచారం. ఈమె ఒక తమిళ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ ప్లే చేసేందుకు 2కోట్ల వరకు అడిగిందని ట్రేడ్ టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: