టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో నటించనున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటివరకు తన కెరీర్లో పోషించని ఒక సరికొత్త రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. మహేష్ కు జోడిగా తొలిసారిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ షెడ్యూల్ అతి త్వరలో అమెరికాలో ప్రారంభం కానుంది.  

ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు ప్రేక్షకాభిమానుల నుండి మంచి స్పందన లభించింది. ఎంతో భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను నిర్మాతలు రూపొందిస్తుండగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా మహేష్ బాబు సినిమాలు చేయనున్నారు. అయితే రాజమౌళి సినిమా కొంత ఆలస్యం అవుతుందని ఈ లోపు త్రివిక్రమ్ సినిమా లైన్లో పెట్టేలా మహేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

హారిక హాసిని క్రియేషన్స్, జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైందట. ప్రస్తుతం త్రివిక్రమ్సినిమా తాలూకు పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న  సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడిగా అనుష్క శెట్టి నటించనున్నట్లు చెబుతున్నారు. పదేళ్ల క్రితం మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. కానీ ఈసారి మాత్రం మహేష్, అనుష్క ల కలయికలో తీయబోయే ఈ సినిమాని భారీగా సక్సెస్ చేసేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచార మవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే ఎన్నో ఏళ్ల తర్వాత మరొక సారి తెరపై మహేష్ అనుష్కల జోడి చూడవచ్చన్న మాట......!!

మరింత సమాచారం తెలుసుకోండి: