టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆచార్య. వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గా పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా దీనిని ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నాయి.  

ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అందించనున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై మహేష్ తో సంప్రదించిన కొరటాల ఆయన ఆమోదం అందుకున్నారని అతి త్వరలో మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారని సమాచారం.  

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆచార్య మూవీ యూనిట్ నుండి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: