ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మూవీ యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు అందించనున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయమై మహేష్ తో సంప్రదించిన కొరటాల ఆయన ఆమోదం అందుకున్నారని అతి త్వరలో మహేష్ బాబు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అందించనున్నారని సమాచారం.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన జల్సా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన బాద్ షా సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించిన విషయం తెలిసిందే. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే ఆచార్య మూవీ యూనిట్ నుండి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!!