మాస్ రాజా రవితేజ హీరోగా ప్రస్తుతం క్రాక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. గతంలో రవితేజ  గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు రెండూ మంచి సక్సెస్ లు అందుకున్నాయి. కాగా వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పనిసరిగా మంచి సక్సెస్ సాధిస్తుందని మాస్ రాజా అభిమానులు భావిస్తున్నారు.

ఇకపోతే ఇటీవల వరుసగా పరాజయాలు అందుకుంటూ కొనసాగుతున్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టేలా కసిగా పని చేస్తున్నట్లు సమాచారం. దీని తర్వాత మాస్ రాజా రవితేజ నటించనున్న  సినిమా కిలాడి. నిన్న ఈ సినిమాకు సంబంధించిన అధికార పూజా కార్యక్రమం కూడా జరిగిన విషయం తెలిసిందే. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు టాక్. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఎంతో భారీ ఖర్చుతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మితం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. కాగా గతంలో రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన వీర సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదు.

అయితే మళ్లీ ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కథ, కథనాల విషయమై దర్శకుడు రమేష్ వర్మ మరింత జాగ్రత్త వహించాలని రవితేజ అభిమానులు కోరుతున్నారు. గతంలో ఫెయిల్ అయిన వీర మాదిరిగా కాకుండా దీన్ని మరింత శ్రద్ధగా తెరకెక్కిస్తే తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందని వారు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి రెండోసారి రమేష్ వర్మ, రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ కిలాడి సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: