కీమహేష్ బాబుకు జోడిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ సినిమాకి పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో కీర్తి సురేష్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉంటుందని అంటున్నారు.
ఇప్పటికే ఆ పాత్ర కోసం ఒక యువ హీరోయిన్ ని మూవీ యూనిట్ ఎంపిక చేసిందని అతి త్వరలో ఈ విషయమై అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. అయితే మెయిన్ హీరోయిన్ మాత్రం కీర్తి సురేష్ చేస్తుండగా, ప్రస్తుతం ఎంపిక కాబడ్డ మరో హీరోయిన్ పాత్ర కూడా సినిమాలో ఎంతో కీలకమైనదని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారమవుతోన్న వార్తలో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి సర్కారు వారి పాట యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..... !!