నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతున్న మూడో చిత్రం లాక్ డౌన్ కు ముందు రెండు భారీ షెడ్యూల్స్ జరుపుకుంది. ఇక అతి త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా బాలయ్య  రెండు పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ సంస్థ పై భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు బోయపాటి తీసుకున్నట్లుగా టాక్. గతంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా ఎంతో భారీ హిట్స్ సొంతం చేసుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల బాలయ్య జన్మదినం సందర్భంగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అదరగొట్టడం అలానే సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇక గత కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా మలయాళ నటి  ప్రగ్యా మార్టిన్ ని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే దీనిపై యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక కొందరు బోయపాటి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా హీరోయిన్ ని ఇంకా ఎంపిక చేయలేదని, అతి త్వరలో హీరోయిన్ పాత్రధారిని ఖరారు చేసిన అనంతరం యూనిట్ అధికారికంగా ప్రకటిస్తుందని అప్పటివరకు అందరూ సైలెంట్ గా ఉండాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య ,బోయపాటి సినిమాలో ప్రగ్యా మార్టిన్ హీరోయిన్ గా నటిస్తోందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.... !!

మరింత సమాచారం తెలుసుకోండి: