టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మాక్సిమం హిట్లున్న హీరో ఎవరంటే అది వెంకటేష్ అనే చెప్పాలి. కెరీర్ లో ఏ హీరో కి లేని హిట్లు విక్టరీ వెంకటేష్ సొంతం. తన సుదీర్ఘ సినిమా ప్రయాణంలో ఒక్కసారి కూడా వివాదాల జోలికి పోలేదు. ఈయన ఒక పర్ఫెక్ట్ హీరో.ఒక్క యాంటీ ఫ్యాన్ కూడా లేని హీరో. ఎంతో మంది కొత్త డైరెక్టర్ లకి  అవకాశాలు ఇచ్చాడు ఈయన. ఇప్పుడు కూడా ఒక కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చాడు. ఇక గత సంవత్సరం ఎఫ్ 2 సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు.

ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘నారప్ప’ చిత్రం చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించాడు వెంకీ. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ‘నారప్ప’ చిత్రం షూటింగ్ 60శాతం పూర్తయ్యింది.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.అతి త్వరలో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.

మార్చిలోపు ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసి అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ఎఫ్3’ అనే చిత్రానికి డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నాడు వెంకీ. అది పక్కా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న చిత్రం. ఇక అది పూర్తయిన తరువాత.. ‘పెళ్ళి చూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి కూడా వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మధ్యనే దర్శకుడు తరుణ్ భాస్కర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి వెంకటేష్ కు వినిపించాడట.

స్క్రిప్ట్ పట్ల వెంకీ సంతృప్తి చెందడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి ఓకే చెప్పేశాడట. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో వెంకీ లెక్చరర్ గా కనిపించబోతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: