ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకి సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఎవరంటే అనుష్క శెట్టి  అనే చెప్పాలి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసినా ఆల్ టైం బ్లాక్ బస్టర్లు కొట్టడం అనుష్కకు అలవాటే. ‘అరుంధతి’ ‘భాగమతి’ చిత్రాలతో ఆ విషయం ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. గత రెండేళ్ళుగా అనుష్క ప్రధాన పాత్రలో ఏ చిత్రమూ రాలేదు. సరే ఈ ఏడాది ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదలవుతుంది కదా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తుండగా.. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూత పడ్డాయి. దాంతో ‘నిశ్శబ్దం’ చిత్రం విడుదల ఆగిపోయింది.

ఎట్టకేలకు నిర్మాతలు ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క తో పాటు మాధవన్ కూడా కీలక పాత్ర పోషించాడు. కోన వెంకట్‌, టి.జి.విశ్వ ప్రసాద్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, షాలినీ పాండే వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా..ఎవ్వరూ ఊహించని విధంగా.. ‘నిశ్శబ్దం’ చిత్రం తాజాగా సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది.

అమెజాన్ ప్రైమ్ చరిత్రలోనే హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సాధించిన చిత్రంగా ‘నిశ్శబ్దం’ నిలిచింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ రికార్డుని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అనుష్క సినిమాలకు ఉండే క్రేజ్ ఏమిటన్నది.. ‘నిశ్శబ్దం’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: