ఎట్టకేలకు నిర్మాతలు ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క తో పాటు మాధవన్ కూడా కీలక పాత్ర పోషించాడు. కోన వెంకట్, టి.జి.విశ్వ ప్రసాద్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు, షాలినీ పాండే వంటి వారు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా..ఎవ్వరూ ఊహించని విధంగా.. ‘నిశ్శబ్దం’ చిత్రం తాజాగా సరికొత్త రికార్డు ని క్రియేట్ చేసింది.
అమెజాన్ ప్రైమ్ చరిత్రలోనే హైయెస్ట్ వ్యూయర్ షిప్ ను సాధించిన చిత్రంగా ‘నిశ్శబ్దం’ నిలిచింది. ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఈ రికార్డుని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అనుష్క సినిమాలకు ఉండే క్రేజ్ ఏమిటన్నది.. ‘నిశ్శబ్దం’ చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...