ఈ నేపథ్యంలో కుమార్ సాయి చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంచల నిజాలను బయట పెట్టాడు. సోలోగానే ఆడాలి.. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకులే అని నేను సింగిల్గానే ఆడాను. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం నాకు మైనస్ అయ్యింది. నేను వెళ్లేసరికి హౌస్లో వాళ్ల ఫ్రెండ్స్తో సెట్ అయిపోయారు. నన్ను కలుపుకోలేదు. మనుషులు అయితే చేయరు.. కొన్ని జంతువులు అలా చేస్తాయి. వీళ్లు అలా చేశారని అనడం లేదు కానీ.. నన్ను అయితే దూరంగానే ఉంచారు. అప్పుడు నాకు భాధగా అనిపించింది.
బిగ్ బాస్ లో కొనసాగాలి అంటే ముందుగా మనమెంటి అనేది చూసుకోవాలి.. ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి అన్నీ చేయాలి.. ముఖ్యంగా అందరినీ ఆకట్టుకునేలా ఏదోకటి చేయాలి. లేకుంటే అసలు పట్టించుకోరు.. హౌజ్ లవ్ ట్రాక్, కామెడీ ట్రాక్ని డిస్ట్రబ్ చేయడానికి ఇష్టం లేక నన్ను ఎలిమినేట్ చేశారా లేదా మరే ఇతర కారణాల వల్ల నన్ను హౌజ్ నుంచి బయటకు పంపారు అనేది తెలియడం లేదు.. అయింది ఏదో అయ్యింది.. నాకు ఒకటి మాత్రం సంతోషంగా అనిపించింది..త్వరలోనే నాగార్జున సార్ ను కలిసి కథ చెప్తాను అని చెప్పుకొచ్చాడు. అప్పుడే నాకు నిజమైన సంతోషం అంటూ కుమార్ సాయి అన్నాడు..మరి ఈ వారం మోనాల్ పక్కా బయటకు వస్తుంది అనే టాక్ చక్కర్లు కొడుతుంది..