అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరో గా సెటిల్ అయిపోయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో  పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కరణ్ జోహార్ ను ఈ సినిమా కి భాగస్వామి కాగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావొచ్చింది.. త్వరలోనే మిగితా షూటింగ్ ని కూడా పూర్తి చేయనున్నారు.. .. విజయ్ దేవరకొండ అనగానే అర్జున్ రెడ్డి సినిమా తప్పక గుర్తొస్తుంది.. కొన్ని సంవత్సరాలకు గానీ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు రావు , హీరోలు రారు.. అలా ట్రెండ్ సెట్ చేసిన హీరో, సినిమా రెండు ఒకేసారి టాలీవుడ్ కి దొరికారు..ఇప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా గురించి మాట్లాడుతున్నామంటే ఆ సినిమా కంటెంట్ అని చెప్పాలి..

ఇక  విజయ్ దేవరకొండ ఇటీవలే సుకుమార్ తో ఓ సినిమా ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండ, సుకుమార్ ల కలయికలో ఒక క్రేజీ పాన్-ఇండియన్ చిత్రం ప్రకటించడం నిజానికి సంచలనమే అయ్యింది. దీనిపై ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ చిత్రాన్ని కేదర్ సెలగంసెట్టి  `ఫాల్కన్ క్రియేషన్స్` బ్యానర్ లో నిర్మిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..

ఈ సినిమ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో బోయపాటి శ్రీను 'భద్ర' సినిమా చేసిన తరువాత మరో మూవీ చేయలేదు. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను దిల్ రాజుతో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. అంతేకాకుండా విజయ్ దేవరకొండకి ఓ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు అడ్వాన్సులు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో దిల్ రాజు ఓ సినిమా సెట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. నిజానికి ఇంద్రగంటి మోహనకృష్ణ - విజయ్ కాంబోలో దిల్ రాజు ఓ మూవీ ప్లాన్ చేసాడు. అయితే 'వి' రిజల్ట్ తర్వాత అది హోల్డ్ లో పెట్టి ఇప్పుడు బోయపాటి శ్రీను - విజయ్ కాంబోలో సినిమా చేయనున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: