ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల ఏకైక ఆప్షన్ పూజాహెగ్డే అంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోల మొదలు అఖిల్ లాంటి పిల్ల హీరోల దాకా ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఏమీ కొరత లేదు. కానీ ఈమెది గోల్డెన్ లెగ్ అని పేరు పడడంతో టాప్ హీరోలకు ఈమె ఏకైక ఛాయిస్ గా మారిపోయింది. దీంతో ఆమెకు డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అందుకే మిగతా అందరూ లాక్ డౌన్ తరువాత అంతా తమ రెమ్యునరేషన్ తగ్గించేస్తుంటే పూజ మాత్రం ఏకంగా కోట్లలో పెంచేసింది.

అయితే ఆమె డిమాండ్ ఇక్కడే కాదు బాలీవుడ్ లోనూ గట్టిగానే ఉంది. సల్మాన్ ఖాన్ చిత్రం కోసం మేకర్స్ ఇప్పటికే ఆమెని సంప్రదించారని ఇటీవల వార్తలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఏకంగా ఆమె రణ్ వీర్ సింగ్ తో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది.  రోహిత్ శెట్టి రణ్ వీర్ సింగ్ లు కలిసి 2018లో ‘సింబా’ సినిమాకు పనిచేసిన సంగతి తెలిసిందే. కాగా మళ్ళీ వీరు రెండో సినిమాగా సూర్య వంశీని తెరకెక్కించారు. ఇప్పుడు వీరు మరోసారి కలిసి పనిచేయనున్నారు.

సినిమా పూర్తి వినోదాత్మక సినిమాగా ప్లాన్ చేయగా ఈ  సినిమాలో పూజా హీరోయిన్‌గా చేస్తోంది.  ఈ సినిమాకు సర్కస్ అని టైటిల్ ను ఫిక్స్ చేశారు.   ఈ సినిమాలో భాగం కావడం చాల త్రిల్ గా ఉందని, ఈ సంతోషం పట్టలేక పోతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతానికి ఆమె ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా షూట్ కోసం ఇటలీలో ఉంది. ఈ సినిమా షూట్ పూర్తి అయ్యాక ఇండియా తిరిగి వచ్చే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: