సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో సమానంగా యాడ్స్ చేస్తుంటాడు. సౌత్ లో వాణిజ్య ప్రకటనలలో నంబర్ 1 స్టార్ ఎవరంటే అది మహేష్ బాబు అని ఎవరైనా చెబుతారు. మహేష్ ఛార్మింగ్ కు పలు కంపెనీలు పోటీ పడి మరి ఆయనాతో ప్రమోట్ చేయిస్తాయి. ఇక ప్రస్తుతం మహేష్ మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే కార్ దేఖో.. కారు అమ్మాలన్నా.. కొనాలన్నా సరే కార్ దేఖో ఉపయోగపడుతుంది.

పైలెట్ అయిన అన్నయ్య చెల్లి ఆన్ లైన్ క్లాసెస్ చెప్పలేక దిగులుగా ఉంటుంది. అలాంటి టైం లో కారుని అమ్మేసి చెల్లికి, స్టూడెంట్స్ కు ల్యాప్ టాప్ కొనిస్తాడు మహేష్. నాకు కారు ఎందుకు ఫ్లైట్ ఉందిగా అంటాడు. ఇదే యాడ్ కాని ఇందులో మహేష్ తన లుక్స్ తో వావ్ అనిపించాడు. మరో పదేళ్లైనా సరే మహేష్ ఇంతే ఉంటాడేమో అనిపిస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా పొలిటికల్ సెటైర్ మూవీగా వస్తుందని టాక్. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు సర్కారు వారి పాటతో మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. 2021 జనవరి లో ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది.                                  


మరింత సమాచారం తెలుసుకోండి: