చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలను ఎదుర్కోని టాప్ హీరో స్థాయికి చేరుకున్నాడు రవితేజ. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ మాస్ మహారాజాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రవితేజ రాజా ది గ్రేట్ సినిమా తర్వాత ఒక్క విజయాన్ని కూడా అందుకోలేదు. ఈ సినిమా తర్వాత వచ్చిన నాలుగు సినిమాలు ఊహించినంతగా సక్సెస్ ని అందుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.  ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా రవితేజ మరో సినిమాను షురూ చేశారు. రమేష్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న 67వ సినిమాకు ఖిలాడి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధిచిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. తన జోష్‌కు తగ్గట్లుగానే డాన్స్‌ మూమెంట్ ‌తో కూడిన పిక్‌ తో దర్శనమిచ్చారు రవితేజ. ఈ చిత్రంలో మరో విశేషమేమిటంటే..రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నట్లు సమాచారం. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌తో కలిపి ఎ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

అయితే తమిళంలో అరవింద్ స్వామి, త్రిష నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతోనే ఈ సినిమా చిత్రీకరిస్తున్నారని సమాచారం. అంతేకాదు గతంలో కోలీవుడ్ లో ‘శతురంగ వేట్టై’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రవితేజకు సాలిడ్ బ్లాక్ బస్టర్ చాల అవసరం. అయితే ఖిలాడి కథలో దమ్ము ఉంది కాబట్టి ప్రస్తుతం రవితేజ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి కథ అయితే మళ్ళీ సకస్ ట్రాక్ ఎక్కడం గ్యారెంటీ అన్న నమ్మకంతోనే ఈ ప్రాజెక్ట్ ను అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: