ఇది ఎన్టీఆర్కు 30వ చిత్రం. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.అంతేకాదు త్రివిక్రమ్ సినిమా అంటే దానికి సమంత కచ్చితంగా ఒప్పుకుంటుంది అనే మాట ఇప్పుడు ఇండ్రస్టీ లో వినబడుతోంది.
కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సమంత ఫిక్స్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది, అ.. ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించింది సమంతా.. ఇటు ఎన్టీఆర్ తో కూడా గతంలో బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస ,జనతా గ్యారేజ్ సిబిమాల్లో జోడి కట్టింది. మరి ఈ సారి వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి..!!