ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే కరోనా ప్రభావం వల్ల సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇక తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడంతో, అతి త్వరలో మళ్ళీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక తాజాగా ఒక్కొక్క హీరో కరోనా పరిస్థితులని ఎదురించి షూటింగ్స్ కి బయలుదేరుతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న rrr షూటింగ్ లో రామ్ చరణ్ కన్నా ముందు ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడట. రాజమౌళి సినిమాతో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ కూడా చెయ్యాల్సి ఉంది.ఎన్టీఆర్ rrr మూవీలో నటించడం, తివిక్రమ్ కి అలా వైకుంఠపురములో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఉండడంతో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాపై భీబత్సమైన అంచనాలున్నాయి.

ఇది ఎన్టీఆర్‌కు 30వ చిత్రం.  ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.అమెరికా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ చిత్రంలో ఓ కథానాయికగా సమంతను పరిశీలిస్తున్నట్టు, ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.అంతేకాదు త్రివిక్రమ్ సినిమా అంటే దానికి సమంత కచ్చితంగా ఒప్పుకుంటుంది అనే మాట ఇప్పుడు ఇండ్రస్టీ లో వినబడుతోంది.

కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సమంత ఫిక్స్ అయ్యిందని అంటున్నారు విశ్లేషకులు. ఇక గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది, అ.. ఆ, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల్లో నటించింది సమంతా.. ఇటు ఎన్టీఆర్ తో కూడా గతంలో బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస ,జనతా గ్యారేజ్ సిబిమాల్లో జోడి కట్టింది. మరి ఈ సారి వీరిద్దరి కెమిస్ట్రీ ఎంత మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: