బిగ్ బాస్ హౌజ్ లో ఇపుడు అచ్చంగా పన్నెండు మంది ఉంటున్నారు. ఈ నంబర్ లో మ్యాజిక్ చాలానే ఉంది. డజన్ మందితో ఉన్న బిగ్ బాస్ నుంచి ఏడవవారానికి ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. చాలా ఉత్కంఠభరితంగా నామినేషన్ పర్వం సాగింది. వారితో పాటు నోయల్ కూడా ఎలిమినేషన్ లో ఉన్నాడు. మొత్తానికి చూసుకుంటే బిగ్ బాస్ లో అవినాష్, దివి, మోనాల్, అభిజిత్, అరియానా, నోయల్ ఈసారి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. వీరిలో వెరీ వీక్ కంటెస్టెంట్ గా మళ్లీ మోనాల్ నే అంతా చూపిస్తున్నారు.

మోనాల్ ఆటలలో పెద్దగా పాల్గొనకపోవడంతో పాటు, ఆమె ఎంతసేపూ అఖిల్ తో  ముచ్చట్లు పెడుతూ హౌజ్ లో ఉంటుందని కూడా కామెంట్స్ ఉన్నాయి. నిజానికి ఆమె ఈ వారమే ఎలిమినేషన్ కావాలి. కానీ కుమారసాయిని పంపేశారు. దాంతో ఆమె సేఫ్ జోన్ లోకి వచ్చింది. ఇపుడు చూసుకుంటే మళ్లీ ఆమె నామినేషన్ లోకి వచ్చింది. దాంతో కుమార సాయి ని అన్యాయంగా బయటకు పంపేశారు అన్న విమర్శలు కూడా ఓ వైపు ఉన్న నేపధ్యంలో ఈసారి బిగ్ బాస్ ఆమెకు తక్కువ ఓట్లు కనుక వస్తే ఎంతమాత్రం ఆపలేరని అంటున్నారు.

ఇక ఆమెతో పొలిస్తే మిగిలిన కంటెస్టెంట్లు అంతా స్ట్రాంగ్ అని చెపాలి. అవినాష్ అయితే ఫస్ట్ టైం నామినేషన్లలోకి వచ్చాడు. ఇక అరియానా స్ట్రాంగ్ అయింది. అభిజిత్ ని ఆడియన్స్ ఎపుడూ గెలిపిస్తూనే ఉన్నారు. నోయల్ కూడా వెరీ స్ట్రాంగ్.  ఇక మిగిలింది. దివి, మోనాల్, ఈ ఇద్దరిలో చూసుకుంటే మోనాల్ గజ్జర్ గత వారం తక్కువ ఓట్లతో బయటపడింది. కాబట్టి ఈసారి ఆమెను హౌజ్ నుంచి పంపుతారు అన్నది నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత వినిపిస్తున్న మాట. అసలు సంగతి తేలాలంటే ఈ ఆదివారం వరకూ ఆగాలి. ఏది ఏమైనా బిగ్ ట్విస్టులు ఇవ్వడం బిగ్ బాస్ కి అలవాటే కదా.






మరింత సమాచారం తెలుసుకోండి: