ఇది నిజంగా పూజా హెగ్డే ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూసే. అందమైన పూజా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగానే కనిపిస్తోందిట. ఆమె చూపు వేరే వైపు ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. పూజా హెగ్డే కి తెలుగులో మంచి అవకాశాలు ఇపుడు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమె టాలీవుడ్ నంబర్ వన్ గా ఉంది. అగ్ర హీరోలందరికీ ఆమె ఫస్ట్ చాయిస్. అలాగే యంగర్ జనరేషన్  కి కూడా ఆమె కావాలి. ఇలా పూజా కి యమ డిమాండ్ టాలీవుడ్ లో ఉంది. ఆమె అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచలర్ మూవీ కొత్త ఏడాదికి రిలీజ్ అవుతోంది. దీంతో పాటుగా ఆమె రెబెల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ. ఇది వచ్చే ఏడాది సమ్మర్ కి టార్గెట్ చేశారు.

ఇక మరో రెండు సినిమాలను కూడా ఆమె తెలుగులో కమిట్ అయిందని టాక్. జూనియర్ ఎంన్టీయార్, త్రివిక్రం కాంబోలో ఆమె హీరోయిన్ అంటున్నారు. ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మూవీలోనూ పూజానే తీసుకున్నారని టాక్. ఇవన్నీ ఇలా ఉంటే మరింతమంది హీరోలు కూడా ఆమె డేట్స్ అడుగుతున్నార్ట. కానీ పూజా మనసు మాత్రం బాలీవుడ్ మీదనే ఉంది. ఇపుడు అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ లతో రెండు సినిమాలు బాలీవుడ్ లో చేస్తున్న పూజా ఆ తరువాత మరో సినిమాను ఒప్పుకుంది.

అది రణ్వీర్ సింగ్ పక్కన మూవీట. సింబా అని 2018లో వచ్చిన ఒక మూవీకి సీక్వెల్ గా వస్తున్నా ఈ సినిమాలో పూజాను సెలెక్ట్ చేశారు అంటే పూజా మనసు ఎక్కడ ఉందో అర్ధమవుతోందిగా. బాలీవుడ్ అంటూ గతంలో ఆమె పరుగులు తీసింది. కానీ అక్కడ మొహంజదారో ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ మళ్లీ ఆదుకుని నిలబెట్టింది. ఇపుడు ఈ క్రేజ్ ఇలా ఉండగానే ఆమె మరోసారి బాలీవుడ్ లో వెలగాలనుకుంటోంది. మరి ఈసారి ఆమె లక్ ఎలా ఉందో తెలియదు కానీ టాలీవుడ్ కి టాటా చెబితే మాత్రం మళ్ళీ ఇక్కడ ఆమె నంబర్ వన్ ప్లేస్ ఖాళీగా ఉండదని మాత్రం అంతా పక్కాగా చెబుతున్నారుట.


మరింత సమాచారం తెలుసుకోండి: