తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించిన బ్యూటీ ఇమ్మాన్యుయేల్‌. త‌న అందం, అభియ‌నంతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది చికాగో బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌. టాలీవూడ్ లో స్టార్ హీరోలు అయినా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాని, అల్లు అర్జున్ వంటి హీరోల‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసి.. త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ.

అయితే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్.. వరుస పరాజయాల కారణంగా డీలా పడిపోయింది. దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మను స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. ఇటీవలే తెలుగులో పునరాగమనం చేసిన అను ఇమ్మాన్యుయేల్‌ కథాబలమున్న సినిమాలతో పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నది.

ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న మహాసముద్రం చిత్రంలో ప్రధాన తారాగణం పేర్లను ఒక్కొక్కటిగా వెల్లడి చేస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మరో కథానాయికగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.

తాజాగా ఆమె చక్కటి అవకాశాన్ని సొంతం చేసుకున్నది. శర్వానంద్‌, సిద్దార్థ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాకు అజయ్‌భూపతి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికగా నటించనున్నది. నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్లు చిత్రబృందం సోమవారం తెలిపింది. ప్రేమ, యాక్షన్‌, భావోద్వేగాల కలబోతగా ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. అదితీ రావ్‌ హైదరీ మరో నాయికగా నటించనుంది. ఏ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిచనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మహాసముద్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డిసెంబరు నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: