సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కనున్న తాజాగా మూవీ 'సర్కారు వారి పాట'. ఈ సినిమాను గీత గోవిందం ఫేమ్ దర్శకుడు పరశు రామ్ తెరకెక్కిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అలాగే మోషన్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఇక మహేష్ అభిమానులు ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎలా అయినా హిట్ కొడతామని. ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్‌లో అమెరికాలో మొదలు పెట్టడానికి ప్లాన్ చేశారు. అయితే ఇప్పటికే పరశరామ్ అండ్ టీం అక్కడికి వెళ్లి లోకేషన్స్ వెదికే పనిలో ఉన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు సర్కారు వారీ పాట టీమ్ కి  వీసాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఎదురయ్యాయని అంటున్నారు.

ఈ షూటింగ్ కోసం యుఎస్ఎకు వెళ్లడానికి మొత్తం యూనిట్ ఇప్పటికే వీసాల కోసం దరఖాస్తు చేసింది, కాని వారి దరఖాస్తు లు ఇంకా ప్రాసెస్ చేయబడలేదని అంటున్నారు. వీసాల ప్రాసెసింగ్ ఆలస్యం కారణంగా, సర్కారు వారీ పాటా షూట్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే డైరెక్టర్ లోకేషన్స్ ఫైనల్ చేసేసి  షూటింగ్ కోసం తగిన అనుమతులను పొందారు. అయితే, వీసా సమస్యలు సర్కారు వారి పాట టీమ్ కు తలనొప్పి కలిగిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: