బిగ్ బాస్ సీజన్ 4లో ఆరవ వారం హౌజ్ నుండి బయటకు వచ్చాడు కుమార్ సాయి. సోలో పర్ఫార్మెన్స్ తో తన ఆట ఆడుతున్న కుమార్ సాయి ఎలిమినేట్ అవడంపై ఆడియెన్స్ అసంతృప్తిగా ఉన్నారు. అయితే కుమార్ సాయి హౌజ్ లోకి వెళ్ళేప్పుడు మూడు కోరికలతో వెళ్లాడు. ఒకటి హౌజ్ లో మంచిగా పర్ఫాం చేసి టాప్ లో ఉండటం.. రెండోది తను బయటకు వచ్చేలోగా కరోనాకు వ్యాక్సిన్ రావడం.. మూడోది నాగార్జునకు ఓ కథ చెప్పే అవకాశం.. ఈ మూడు కోరికలతో హౌజ్ లోకి వెళ్ళాడు.

అయితే కుమార్ సాయి బయటకు వచ్చాడు.. మొదటి రెండు కోరికలు తీరలేదు. కాని 3వది నాగార్జునకు కథ వినిపించడానికి రెడీ అవుతున్నాడు. కుమార్ సాయికి నాగ్ కథ వినేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి నాగ్ మెప్పించే కథను కుమార్ సాయి చెబుతాడా లేదా అన్నది చూడాలి. ఈరోజుల్లో సినిమాతో కమెడియన్ గా పరిచయమై కొన్ని సినిమాలు చేసిన కుమార్ సాయి నటుడిగా మానేసి డైరక్టర్ గా టర్న్ తీసుకోవాలని చూస్తున్నాడు.

కుమార్ సాయికి నిజంగా నాగార్జున కథ చెప్పి ఓకే చేయించుకుంటే మాత్రం తన ఫేట్ మారినట్టే అవుతుంది. బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన కుమార్ సాయిపై ఆడియెన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. హౌజ్ లో ఇప్పుడిప్పుడే తన ఆట మొదలు పెట్టిన కుమార్ సాయిని ఇంత త్వరగా ఎలిమినేట్ చేయడంపై ఆడియెన్స్ అసంతృప్తిలో ఉన్నారు. కుమార్ సాయి ఈమధ్య కోల్పోయిన క్రేజ్ బిగ్ బాస్ ద్వారా తెచ్చుకున్నాడని చెప్పొచ్చు.                                                         
 

మరింత సమాచారం తెలుసుకోండి: