వికారాబాద్ అడవుల్లో ప్రస్తుతం కొన్ని వర్షపు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. కాగా, హీరో సుశాంత్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులు సెప్టెంబర్ 25వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణ జరిపారు. నటి రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా రుకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత తిరిగి ఇప్పుడు షూటింగ్ లో పాల్గొన్నారు.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్నప్పుడు సెట్ లో క్రిష్, వైష్ణవ్ తేజ్ గొడుగు పట్టుకుని మాట్లాడుకుంటున్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ రెండు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్లోడ్ చేసి షేర్ చేశారు. దీనికి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ‘వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలను, మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా మహమ్మారీతోపాటే వర్షాన్ని ఎదుర్కొని వర్షపు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఏం జరిగినా పని మాత్రం ఆపలేం.’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.