అన్ లాక్ ప్రక్రియతో కొనసాగడంతో హీరో హీరోయిన్లు సినిమా షూటింగ్ లలో బిజీ అయ్యారు. లాక్ డౌన్ లోనే రెండు, మూడు సినిమాలకు ఓకే చెప్పేసి ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ కూడా ప్రారంభమయ్యాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా విరామం అనంతరం తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. గ్రామీణ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతుంది.

వికారాబాద్ అడవుల్లో ప్రస్తుతం కొన్ని వర్షపు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు క్రిష్. కాగా, హీరో సుశాంత్ ఆత్మహత్యతో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో నార్కోటిక్ అధికారులు సెప్టెంబర్ 25వ తేదీన రకుల్ ప్రీత్ సింగ్ ను విచారణ జరిపారు. నటి రియాను అరెస్టు చేసిన ఎన్సీబీ అధికారులు ఆమె స్టేట్ మెంట్ ఆధారంగా రుకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లను విచారించారు. విచారణ ముగిసిన తర్వాత తిరిగి ఇప్పుడు షూటింగ్ లో పాల్గొన్నారు.

తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. వర్షం పడుతున్నప్పుడు సెట్ లో క్రిష్, వైష్ణవ్ తేజ్ గొడుగు పట్టుకుని మాట్లాడుకుంటున్న సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ రెండు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్లోడ్ చేసి షేర్ చేశారు. దీనికి ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. ‘వర్షంలో షూటింగ్ అంటే కెమెరాలను, మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా మహమ్మారీతోపాటే వర్షాన్ని ఎదుర్కొని వర్షపు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ఏం జరిగినా పని మాత్రం ఆపలేం.’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: