ఈ సినిమాను స్టార్ట్ చేసి మధ్యలో వైష్ణవ్ తేజ్ తో క్రిష్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాను పూర్తి చేసి పవర్ స్టార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. పవన్, క్రిష్ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పవన్ కెరియర్ లో ఎప్పుడు చూడని విధంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
పవన్ 27వ సినిమాగా వస్తున్న ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ 28వ సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ పూర్తి కాగానే క్రిష్ డైరక్షన్ లో సినిమా ఆ తర్వాత మిగతా కమిటెడ్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్.