పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న క్రేజీ సినిమా మొదటి షెడ్యూల్ 15 రోజుల షూటింగ్ జరుపుకుంది. కరోనా లాక్ డౌన్ తర్వాత త్వరలో ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను పవన్ కెరియర్ లో ప్రత్యేకమైన సినిమాగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపిస్తాడని టాక్. ఇక ఈ సినిమా డిసెంబర్ నుండి సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్.

ఈ సినిమాను స్టార్ట్ చేసి మధ్యలో వైష్ణవ్ తేజ్ తో క్రిష్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు. వైష్ణవ్ తేజ్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాను పూర్తి చేసి పవర్ స్టార్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. పవన్, క్రిష్ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను పవన్ కెరియర్ లో ఎప్పుడు చూడని విధంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.

పవన్ 27వ సినిమాగా వస్తున్న ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో పవన్ 28వ సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో కూడా పవన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్ పూర్తి కాగానే క్రిష్ డైరక్షన్ లో సినిమా ఆ తర్వాత మిగతా కమిటెడ్ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు పవన్.                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: