‘పెంగ్విన్’ సినిమా ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ అయింది. అలానే ‘గుడ్ లక్ సఖీ’ సినిమాకి మీడియాలో మంచి ప్రాధాన్యమే లభిస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్ నగేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకి సంబంధించి పలు ప్రమోషన్స్ చేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కానీ ‘మిస్ ఇండియా’ సినిమా గురించి అసలు చప్పుడే లేదు. అప్పుడెప్పుడో టీజర్ రిలీజ్ చేసి ఊరుకున్నారు. అప్పటినుండి ఎలాంటి అప్డేట్ లేదు.
వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. కీర్తి సురేష్ కూడా ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. మరి మేకర్స్ ఈ సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నారో..? ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..