టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ఆమె క్రేజ్ చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. రమ్యకృష్ణ తో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. అటు స్టార్ హీరోలు కూడా రమ్యకృష్ణ తో సినిమా చేసే అవకాశం వస్తే చాలు అనుకునే పరిస్థితి ఉంది అనే విషయం వాస్తవం. దీనితో ఇప్పుడు రమ్యకృష్ణ కూడా తెలుగులో భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది అనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో వినపడుతున్నాయి.

మొన్నటి వరకు చూసీచూడనట్టుగా తీసుకున్న రమ్యకృష్ణ ఇప్పటి భారీగా డిమాండ్ చేయడంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఇప్పుడు కోటి నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాక్. మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమాలో ఆమె దాదాపు మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని అంటున్నారు. ఆ సినిమాలో ఆమె మహేష్ బాబు కి తల్లిగా నటించే అవకాశాలు ఉండవచ్చు. దీంతో ఆమె కాస్త తనకు వచ్చిన అవకాశాలు ఎక్కువగా వాడుకునే ప్రయత్నం చేస్తోందని జనాలు అంటున్నారు.

మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది తెలియదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా లో కూడా ఆమె భారీగా డిమాండ్ చేసినట్లుగా సమాచారం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఆర్ధిక కష్టాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా తీసుకోవాలని అడిగారట. దీనితో రమ్యకృష్ణ కూడా కాస్త వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి నటించబోయే సినిమాలో కూడా ఆమె నటించే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుందో ఏంటి అనేది చూడాలి. అటు తమిళంలో కూడా  ఆమె చాలా బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: