టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే ఆ సినిమా గురించి ఉండే చర్చల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా గురించి మీడియాలో కూడా కాస్త ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. ఇక సినిమా ఇప్పుడు కరోనా కష్టాలు ఉన్న సమయంలో వస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జాగ్రత్తలు తీసుకునే అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాలో పెట్టుబడి పెట్టి నిర్మాతలు కూడా ఇప్పుడు పెట్టుబడి  ఎక్కువగా లేకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఇప్పుడు వస్తున్న వార్తలను ఆధారంగా చూస్తే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో చాలా వరకు కూడా ఖర్చు తక్కువగా వుండే విధంగా ప్లాన్ చేసుకోవాలి అని భావిస్తున్నారు. దీనితో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత కల్యాణరామ్ మరో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా హీరో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద తెచ్చినట్లుగా తెలుస్తుంది.

సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విషయంలో ఎక్కువ కాలం ఎదురు చూడకుండా సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సరికొత్త కోణంలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అవసరం అయితే సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేక టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకుని ప్రమోషన్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారట. లేదా ఏదైనా మీడియా సంస్థలతో ఒప్పందం చేసుకుని ఆ మీడియా సంస్థ ద్వారానే ఇప్పుడు ట్రైలర్ కానీ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు గానీ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: