టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా కొరటాల శివ పేరు ఎక్కువగా వినబడుతున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ సినిమాలను చేసే విషయంలో కొరటాల శివ దూకుడుగా వెళుతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారు ఏంటి అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత కూడా లేదు. త్వరలోనే దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇక ఇప్పుడు వస్తున్న కొన్ని వార్తల ఆధారంగా చూస్తే మహేష్ బాబు, కొరటాలశివ కు మధ్య గ్యాప్ వచ్చినట్లుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరి దీనికి ప్రధాన కారణం ఏమిటి అనేది తెలియదు. కానీ వీరిద్దరి మధ్య ఇప్పుడు విభేదాలు బయటపడ్డాయి అని అంటున్నారు. వాస్తవానికి మహేష్ బాబు కొరటాల శివ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ సినిమా విషయంలో కొరటాల శివ ముందుకు రాలేదు. వాస్తవానికి ఆ సినిమాకు కొరటాల శివ ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే ఆ తర్వాత అనూహ్యంగా అల్లు అర్జున్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దానిపై అధికారిక ప్రకటన చేశాడు. దీంతో  మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఉన్నారట.

ఆచార్య సినిమా త్వరలో అయిపోతే కొరటాల శివతో సినిమా చేయవచ్చని, ప్రస్తుతం చేస్తున్న సినిమా వాయిదా వేసుకోవచ్చు అని మహేష్ బాబు ప్లాన్ చేశాడట. అయినా సరే అది సాధ్యం కాలేదని అంటున్నారు. దీనితో ఇప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని  అంటున్నారు. దీనితో ఒక నిర్మాత వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ తో సినిమా పూర్తి చేసిన తర్వాత మహేష్ బాబుతో కొరటాల శివ సినిమా చేసే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: