కొన్నాళ్ళుగా తన ఫ్యాన్స్ అతని సోషల్ మీడియా ఎంట్రీకి రిక్వెస్ట్ చేస్తున్నా సరే శింబు సైలెంట్ గా ఉన్నాడు. ఫైనల్ గా శింబు తన సోషల్ మీడియా ఎంట్రీకి ముహుర్తం ఫిక్స్ చేశాడు. దసరా కానుకగా ఈ నెల 22న ఉదయం 9:09 గంటలకు శింబు సోషల్ మీడియా ఎంట్రీకి ప్రోగ్రాం ఫిక్స్ చేశాడు. శింబు సోషల్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.
ఇదివరకులా వివాదాలతో కాకుండా ఇక మీదట జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బెటర్. ప్రస్తుతం వెంకట్ ప్రభు డైరక్షన్ లో మానాడు సినిమా చేస్తున్నాడు శింబు. ఈ సినిమాతో మళ్ళీ తను మునుపటి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు. మరి శింబు సోషల్ మీడియా ఎంట్రీకి ఈ హడావిడి ఎందుకో కాని ఎంట్రీ తర్వాత క్రేజ్ డబుల్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమాలతో కన్నా వివాదాలతో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్న శింబు సోషల్ మీడియా ఎంట్రీపై ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా శింబు సోషల్ మీడియా ఎంట్రీ రికార్డ్ సృష్టిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.