రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
యువ దర్శకుడు రాధా
కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్
సినిమా రాధేశ్యామ్. యు.వి.క్రియేషన్స్, గోపి
కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ
సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల ఇటలీలో మొదలైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కు ముందు చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ప్రభాస్ సరసన తొలిసారిగా
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని కొన్నేళ్ళ క్రితం
యూరప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు
రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నట్లు టాక్.
బాలీవుడ్ సీనియర్ నటి
భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్న ఈ సినిమాలో
ప్రియదర్శి, షాషా ఛత్రి, జయరాం,
మురళి శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇకపోతే రేపు
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ
సినిమా ఫస్ట్ లుక్ మోషన్
పోస్టర్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి మా
ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో సీనియర్ నటి
మీనా నటిస్తున్నారని, అలానే ఈ సినిమాలో ఆమెది నెగెటివ్ పాత్ర అని సమాచారం.
ఇటీవల అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తున్న
మీనా ఈ సినిమాలోని పాత్ర నెగిటివ్ గా ఉన్నప్పటికీ అది తనకు ఎంతో నచ్చడంతో ఆమె ఈ
సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే దీనికి సంబంధించి రాధేశ్యామ్
మూవీ యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.....!!