సినీ హీరోలు తమ దాతృత్వాన్ని మరో సారి చాటుకున్నారు. కష్ట కాలంలో సహాయంగా ఉంటామని మరోమారు నిరూపించారు.  గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ మహా నగరాన్ని వర్షం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత కొన్నేళ్లుగా  చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భాగ్యనగర వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వాళ్ల జీవితాలు నీట మునిగిపోయాయి. ప్రస్తుతం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు మారిపోయింది పరిస్థితి. ఇలాంటి సమయంలో వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా తనవంతు సాయం చేస్తుంది.


ఈ క్రమంలో పలువురు సినీ హీరోలు తెలంగాణ సహాయ నిధికి తమ వంతు సాయం చేస్తున్నారు.చెరువు కట్టలు తెగి ఇళ్ళ మధ్యలోంచి వరదలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్ల పక్కన నివాసముంటున్న ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.ఇప్పటికే నందమూరి నట సింహం బాలకృష్ణ .. హైదరాబాద్ వరద బాధితులకు రూ. 1.50 కోటి విరాళం ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ వరదల నేపథ్యంలో నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తమ వంతు విరాళం ప్రకటించారు. నాగార్జున.. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు.


మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. నాగార్జున.. తెలంగాణ సహాయనిధికి రూ. 50 లక్షల విరాళం ప్రకటించాడు. మరోవైపు ఎన్టీఆర్ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతుగా రూ. 50 లక్షలు ప్రకటించాడు. మహేష్ బాబు కూడా రూ. కోటి విరాళం ప్రకటించారు. హీరో రాం పోతినేని రూ.25 లక్షలు సహాయం గా ప్రకటించారు. యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ 10 లక్షలు విరాళం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: