తెలుగు బిగ్ బాస్ షో ఇప్పుడు కాస్త దూకుడును కొనసాగిస్తుంది. మొదట్లో ఈ షో అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేక పోయింది. ఇప్పుడు మాత్రం ఈ షో వల్ల నిద్ర పట్టడం లేదు..అంతగా ఆలోచనలో పడేస్తుంది. ఎలిమినేషన్ తర్వాత మరో వారం మొదలైంది అంటే హౌస్ లో రచ్చ షురూ అయినట్లే.. ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఆలోచనలు కొత్తగా సాగుతాయి.వింత టాస్క్ ల పేరుతో ఇంటి సభ్యుల మధ్య గొడవలు పెడతాడు. మళ్లీ రొమాన్స్ తో రాజేస్తాడు. ఎటూ చూసిన బిగ్ బాస్ అల్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ అని చెప్పాలి..



ఇది ఇలా ఉండగా ఆరోవారం లో కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. తర్వాత ఏడో వారానికి నామినేషన్ మొదలైందని తెలుసు. సోమవారం నామినేషన్ ప్రక్రియ ను హోరా హోరీగా పూర్తి చేశారు.12 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. వీరిలో ఏడోవారం ఎలిమినేషన్‌కు ఆరుగురు నామినేట్ అయ్యారు. ఆ ఆరుగురు.. నోయల్, అభిజీత్, అవినాష్, దివి, అరియానా, మోనాల్‌ లు డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వారం ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారు అనేది ఆసక్తిగా మారింది.



ఇకపోతే బిగ్ బాస్ లో మసాజ్ ఎక్కువైంది.. దాంతో పాటుగా మసాలా కూడా ఎక్కువైందని తెలుస్తుంది. లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు. దీనికి ‘కొంటె రాక్షసులు.. మంచి మనుషులు’ అనే టైటిల్ పెట్టారు. ఈ టాస్క్ లో భాగంగా రాక్షసుల టీమ్ లో ఉన్న హారిక కన్ను, మంచి మనుషులు టీమ్ లో ఉన్న సోహెల్ పై పడింది. టాస్క్ అనే నెపంతో అతని మీద పడి మరీ దొర్లింది.. నిన్న మొన్నటి వరకు అభిజిత్ తో పులిహోర కలిపిన ఈ హారిక ఇప్పుడు గత రెండు వారాల నుంచి సోహెల్ పై మనసు పారేసుకుందని అందరూ అనుకుంటున్నారు.అందుకు కారణం కూడా లేకపోలేదు..మొత్తానికి అలా నలుపుకోడాలు, దొర్లడాలతో టాస్క్ ను పూర్తి చేశారు.అయితే అన్నిటిలోనూ మంచి మనుషులు విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు ఏడో వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: