హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే టాప్ పొజిషన్ లకు వెళ్లిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎంత మంది ఉన్నారంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఎందుకంటే ఏటా వందల మంది హీరోయిన్స్ గా తెరకు పరిచయం అవుతున్నా ఒకరో ఇద్దరో కొంచెం ఫేం తెచ్చుకుని నిలబడగలుగుతారు. అలాంటి వాళ్ళలో పూజా హెగ్దే ఒకరు. అసలు ఏ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈమె ఇప్పుడు తెలుగులోనే కాక సౌత్ తో పాటు హిందీలో కూడా తన సత్తా చాటుతోంది.

 నాగ చైతన్య ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా ఒక్కో సినిమా హిట్ కొడుతూ ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించేసింది. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లో రాధే శ్యామ్ మరియు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఆమె రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్‌ తో రొమాన్స్ చేస్తోంది, అలానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కోసం ఆమె అక్కినేని అఖిల్ తో రోమాన్స్ చేస్తోంది.

పూజా తాజాగా రాధే శ్యామ్ సెట్స్ లో నుంచి ఓ వీడియో తీసి ట్విట‌ర్ లో పోస్ట్ చేసింది. అంతే కాదు మీ కోసం పెద్ద స‌ర్ ఫ్రైజ్ రేపు మీ ముందుకు రాబోతుంది.   అప్ప‌టివ‌ర‌కు వేచి ఉండండి అంటూ సెట్స్ లో తీసిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ సర్ప్రైజ్ టీజర్ విడుదల గురించే అయ్యుండొచ్చని అంటున్నారు. అది ఏమై ఉంటుందో తెలియాలంటే ఈరోజు వరకూ ఆగాల్సిందే. ఇకపోతే నిన్న ఈ సినిమా సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ పేరును అనౌన్స్ చేశారు నిర్మాతలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: