సినిమా కథ విషయానికి వస్తే.. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.ఇదిలా ఉంటే వచ్చే ఏడాది మహేష్ రెండు సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తికావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి మహేష్ సర్కారు వారి పాట సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడని సమాచారం.
2021లో సర్కారు వారి చిత్రం చేస్తూనే.. త్రివిక్రమ్ మూవీని కూడా చేయనున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కనీసం ఆరు నెలల గ్యాప్లోనే మహేష్ రెండుసార్లు అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు..త్రివిక్రమ్ తో తన సినిమా ఉంటుందని ఈ మధ్యనే మహేష్ ఓ హింట్ ఇవ్వడం జరిగింది. ఇటు త్రివిక్రమ్ కూడా మహేష్ కోసం ఓ స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే త్రివిక్రమ్ తో మహేష్ సినిమా కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు విశ్లేషకులు...!!