టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్..త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాత వాసి సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి పవన్ రాజకీయాల్లో బిజీ బిజీగా మారిపోయాడు. ఇక ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత  సుదీర్ఘ విరామం తీసుకుని సినిమాలు చేసేందుకు ఒప్పుకున్న ఈ జనసేన నాయకుడి షెడ్యూల్ మొత్తం తారుమారయింది. వచ్చే ఎన్నికల్లోగా వీలైనన్నీ సినిమాలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే వరుసగా సినిమాలను ఒకే చెప్తూ వచ్చాడు. ప్రస్తుతం పవన్ చేతిలో ఐదు సినిమాలున్నాయి.
 
అందులో ఒకటి డైరెక్టర్ క్రిష్ సినిమా కావడం విశేషం.ప్రస్తుతం పవన్ చేస్తున్న వకీల్ సాబ్ మూవీ తుదిదశలో ఉన్నది. మరోవైపు కరోనా కారణంగా క్రిష్ డైరక్షన్ లోని సినిమా కాస్తా వెనుక పడింది. విభిన్న కథలతో ఎప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం అందించే డైరెక్టర్ క్రిష్.పవన్ కళ్యాణ్ తో ఓ చారిత్రాత్మక  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ 27 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో జరిగింది. ఔరంగజేబు కాలంనాటి కథతో క్రిష్మూవీ చేస్తున్నాడు.

మూవీ కి చాలా గ్యాప్ రావడం తో ఈ లోపు క్రిష్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఒక ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని నవంబర్ కల్లా ముగించేసి ఓఅవాన్ తో డిసెంబర్ లో మొదలు పెట్టాలని యోచనలో ఉన్నట్టు టాక్. ఇప్పటికే పలు ఆసక్తికర టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.క్రిష్ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి... ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు పవర్ స్టార్. 

మరింత సమాచారం తెలుసుకోండి: