ప్రస్తుతం కంగనా రనౌత్ తన సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలకు ఒడిశాకు చెందిన న్యాయవాది నుంచి అత్యాచార బెదిరింపులతో కూడిన కామెంట్స్ వచ్చాయి. ‘నడిరోడ్డుపై అత్యాచారం చేస్తా’ అంటూ వచ్చిన కామెంట్స్ చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అయితే కంగనా రనౌత్ మాత్రం ఆ కామెంట్స్ పై స్పందించలేదు.
కంగన స్పందించకపోయినా.. ఆమె అకౌంట్ ని ఫాలో అవుతున్నవారికి అత్యాచార కామెంట్స్ కనపడ్డాయి. ఈ కామెంట్స్ హైలెట్ కావడంతో.. ఆ న్యాయవాది ఎవరా అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. దీంతో ఆ లాయర్ ఒడిశాకు చెందిన వ్యక్తి అని తేలింది. ఆ వెంటనే అతను తేరుకున్నాడు. తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతూ ఆ అకౌంట్ ని డిలీట్ చేశాడు. ఆ తర్వాత సదరు లాయర్ ఎవరికీ అందుబాటులో లేరని తేలింది. ఒకవేళ నిజంగానే లాయర్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కి గురయిందా లేక, కావాలనే అతడు కామెంట్స్ పెట్టి డిలీట్ చేశాడా అనే విషయం సస్పెన్స్ గా మారింది.