ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన 17 నిమిషాల వీడియోను అభిమానుల రిక్వెస్ట్ మేరకు విడుదల చేస్తున్నారు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేసారు. అర్జునుడి గెటప్లో బాలయ్య అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఈరోజు కూడా శ్రీహరి భీముడి గెటప్ లో ఉన్న లుక్ రిలీజ్ చేశారు. 17 నిమిషాలున్న ఈ సినిమా తాలూకు సన్నివేశాలని అక్టోబరు 24న విజయదశమి సందర్భంగా శ్రేయాస్ ఈటీ ద్వారా ఎన్బీకే థియేటర్లో విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాల కోసం ఉపయోగించనున్నట్లు కూడా ప్రకటించడంతో బాలయ్య ఫ్యాన్స్ భారీగా ప్లాన్ చేశారు. అదేంటంటే ఈ సినిమాని మినిమం టికెట్ ధరని 50 రూపాయలుగా నిర్ణయించారు. కానీ ఎంత అయినా పెట్టి ఈ సినిమాని చూడొచ్చు. ఈ నేపధ్యంలో కొంత మంది బాలయ్య అభిమానులు `నర్తనశాల` టికెట్ ని రూ10 లక్షలకు కొనాలని ఫిక్స్ అయినట్లు టాక్. చూడాలి ఆయనా అభిమానులు కలిసి ఈ సినిమా ద్వారా ఎంత సేవ చేస్తారో.