ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీలో హీరోగా నటిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ దీనికి సంగీతాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది/ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలతో దేశ విదేశాల్లో భారీ స్థాయిలో క్రేజ్ ని పాపులారిటీని మార్కెట్ వాల్యూని దక్కించుకున్న ప్రభాస్, ఆ తర్వాత సాహో సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇక రాదేశ్యామ్ తర్వాత నాగ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ నటించనున్నారు. ఇక ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తన సినిమా, వ్యక్తిగత సంగతుల గురించి అభిమానులతో ప్రేక్షకులతో పంచుకునే అలవాటు గల రెబల్ స్టార్ ప్రభాస్ పలు మార్లు ఎన్నో గొప్ప సహాయాలు చేసి మంచి మనసున్న వ్యక్తిగా పేరు దక్కించుకున్నారు. ఇక కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా ఎందరో ప్రజలు నిరాశ్రయులవ్వడం అలానే పలు వారు పలు సమస్యలను ఎదుర్కోనుండడంతో, అటువంటి వారిని ఆదుకోవడానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రముఖులు ముందుకు రావడం జరిగింది.

కాగా రెబల్ స్టార్ ప్రభాస్ నిన్న తన వంతుగా మొదట కోటి రూపాయలు సాయం అందించారు. అనంతరం మరొక రూ. 50 లక్షల రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిస్తున్నట్లు ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు ప్రభాస్. అలానే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి వారు కోటి రూపాయలు సాయమందించగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.50లక్షలు అందించారు. తెలుగు ప్రజలకు ఎప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమ అండగా ఉంటుందని వారిని ఆదుకోవడానికి తాము ఎప్పుడూ ముందే ఉంటాం అని చిత్ర పరిశ్రమ వారు ఈ విధంగా మరొకసారి తమ మంచి మనసు చాటుకున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: