రెండున్నరేళ్ల క్రితం అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను చవిచూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఇక ఇటీవల మళ్లీ వకీల్ సాబ్ సినిమా ద్వారా ముఖానికి మేకప్ వేసుకున్న పవర్ స్టార్ ప్రస్తుతం దానితోపాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల అనంతరం హరీష్ శంకర్ తో ఒక సినిమాతో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా చేయనున్నారు పవన్.

ఈ విధంగా పవన్ ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్లో పెట్టగా దాని తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా, అలానే ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగు రీమేక్ లో కూడా పవర్ స్టార్ నటించనున్నట్లు టాక్. మొత్తంగా చూసుకుంటే పవర్ స్టార్ కాల్షీట్స్ డైరీ అసలు ఖాళీ లేదని ఆయన ఆరు సినిమాల వరకు ఒప్పుకోవడంతో ఇప్పట్లో మరో దర్శకుడితో పని చేసే అవకాశం లేదని అంటున్నారు. ఇకపోతే ఇటీవల కొద్ది రోజుల క్రితం పవర్ స్టార్ ను ప్రత్యేకంగా ఆయన నివాసంలో కలిసిన యువ దర్శకుడు వెంకీ కుడుముల ఆయనకు ఒక అద్భుతమైన స్టోరీని వినిపించాడని అది ఎంతో నచ్చి ఎగ్జైట్ అయిన పవన్, దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి అవకాశాన్ని బట్టి సినిమా చేద్దాం అని అన్నారట.

అయితే పవన్ చెప్పిన మాటలు మేరకు ప్రస్తుతం స్క్రిప్టు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన వెంకీ కుడుములకు ఆ సినిమాని తెరకెక్కించే ఛాన్స్ ఇప్పట్లో లేదని అంటున్నారు. ఎందుకనగా ఇప్పటికే పవన్ ఒప్పుకున్న సినిమా పూర్తవడానికి దాదాపుగా రెండున్నరేళ్ళకు పైగా టైం పెట్టె అవకాశం ఉంది కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాతనే ఆయన మరో సినిమా చేస్తారని అంటున్నారు. ఒకవేళ పవన్ కోసం వెంకీ కుడుముల పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ ఆ సినిమా కోసం మరొక రెండున్నరేళ్ళకు పైగా ఆగాల్సిందే అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: