భీభత్సం సినిమాతో టాలీవుడ్ కి సంగీతదర్శకుడిగా అడుగుపెట్టాడు ఎస్.ఎస్.తమన్. ఆ తర్వాత రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కిక్ సినిమాకి అద్భుతమైన సాంగ్స్ అందించడంతో పాటు దాని ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు థమన్. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం సినిమాలకు సూపర్ సాంగ్స్ అందించి మరింత పేరు సంపాదించాడు. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకెళ్ళాడు థమన్. అయితే ఆ తర్వాత తన పై కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనేటువంటి కొంత ముద్ర పడటంతో ఇటీవల కొన్నాళ్ళ క్రితం కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్న థమన్, ఆపై మహానుభావుడు సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడి నుండి ఇప్పటివరకు వరుసగా మ్యూజికల్ హిట్స్ ని అందుకుంటూ కొనసాగుతున్నాడు.

ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమాకు అద్భుతమైన సాంగ్స్ అందించి జాతీయస్థాయిలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం థమన్ చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట, యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కలయికలో త్వరలో తెరకెక్కనున్న సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా థమన్ పనిచేస్తున్నప్పటికీ ముఖ్యంగా ఈ ముగ్గురు అగ్ర హీరోల అభిమానుల కళ్లన్నీ థమన్ మీదనే ఉన్నాయి.

ఎందుకంటే అలవైకుంఠపురములో సాంగ్స్ అదరగొట్టిన థమన్, ఎట్టి పరిస్థితుల్లో తమ తమ హీరోల సినిమాలకు కూడా ఇరగదీసే సాంగ్స్ ఇస్తాడని వారు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఒకరకంగా ఈ విషయమై థమన్ లోలోపల కొంత భయపడుతున్నాడని, అయినప్పటికీ ఆ ముగ్గురు హీరోల అభిమానులను తప్పనిసరిగా సంతృప్తిపరిచే విధంగా అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేస్తూ అందుకోసం కోసం ఎంతో కృషి చేస్తున్నాడట. మరి ఇదే గనుక నిజమైతే నిజంగా పవన్, ఎన్టీఆర్, మహేష్ అభిమానులకు ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: