ఇక ఈ సినిమాలో ప్రధానమైన అధీరా అనే విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, అలానే మరొక దిగ్గజ నటుడు రావు రమేష్ ఇద్దరూ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుందని అలానే భారీస్థాయిలో రూపొందిన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు.
మరీ ముఖ్యంగా ఈ కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాకు అత్యంత కీలకమైన సీన్ అంటే క్లైమాక్స్ సీన్ అని ఆ సీన్లో హీరో, విలన్ ల మధ్య వచ్చే భీకర పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్క పొడుచుకునేలా చేస్తాయని, యావత్ భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా అత్యంత భారీ ఖర్చుతో ఎంతో గ్రాండ్ లెవల్లో ఆ క్లైమాక్స్ సీన్ తెరకెక్కించబడిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా కేజిఎఫ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది అభిమానులకు పండుగ వార్తే అని చెప్పక తప్పదు.....!!