టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించడం చాలా కష్టమనే చెప్పాలి. అందం - అభినయం రెండూ ఉన్నా కూడా ఎందుకో వాళ్ళని ఇండస్ట్రీ పక్కకు పెడుతోంది. స్టార్ హీరోలు మొహమాటమో లేక అడ్జస్ట్ కాలేరనో తెలీదు కానీ తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ లు అయితే రావడం లేదు. చిన్న హీరోలతో మాత్రమే తెలుగు అమ్మాయిలు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన గా మారి నంది అవార్డ్‌ కూడా అందుకున్న తెలుగమ్మాయి రీతూ వర్మ.

అయితే ఈ హీరోయిన్‌కి కేశవ తర్వాత మరో తెలుగు సినిమా చెయ్యడానికి మూడేళ్లు పట్టింది. టక్‌ జగదీష్‌ తో మళ్లీ తెలుగు తెరపై కనిపిస్తోంది రీతు. ఇక విజయ్ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్ లో నలుగురు హీరోయిన్లు నటించగా ఆ నలుగురిలో తెలుగు అమ్మాయి ఐశ్వర్యా పెర్ఫామెన్స్ కి మంచి మార్కులు దక్కాయి. అయితే ప్రశంసలు తప్ప ఈమెకి భారీ అవకాశాలు అయితే దక్కలేదు. ఈమె కూడా  నాని టక్‌ జగదీష్‌ లాంటి చిన్న సినిమాలే చేస్తోంది.

 ఇక మనదగ్గర పెద్దగా అవకాశాలు రాకున్నా బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తోన్న తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ళ. అడివి శేష్‌ గూఢచారి సినిమాతో టాలీవుడ్‌ లో మెరిసిన ఈ హీరోయిన్‌ కి తెలుగునాట మాత్రం పెద్దగా అవకాశాలు రాట్లేదు. శోభితకి అడివి శేష్ తదుపరి సినిమా మేజర్‌ తప్ప మరో తెలుగు సినిమా లేదు. ఈమె కాక ఈషా రెబ్బా కూడా చాలా ఎక్కువగా వినిపిస్తున్న తెలుగు హీరోయిన్ పేరు. ఈమె వరుసగా సినిమాలు చేస్తున్నా ఇప్పటి వరకు అనుకున్న గుర్తింపు రాలేదు. మరి వీళ్ళు ఎప్పటికి లైం లైట్ లోకి వస్తారో ఏమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: