ప్రభాస్ 20వ సినిమాగా వస్తున్న సినిమా రాధే శ్యాం. జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రేరణగా పూజా హెగ్దే లుక్ ఆమధ్య రిలీజ్ చేయగా లేటెస్ట్ గా సినిమా నుండి ప్రభాస్ లుక్ రిలీజ్ చేశారు. విక్రామదిత్యగా ప్రభాస్ క్రేజీ ఫస్ట్ లుక్ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఓ పిరియాడికల్ లవ్ స్టోరీగా వస్తుందని అన్నారు.

తన ప్రేమకోసం విక్రమాదిత్య చేసిన సాహసం ఎలాంటిది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. రాధాకృష్ణ చాలా కాన్ ఫిడెంట్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత సాహోతో కొద్దిగా వెనకపడ్డ ప్రభాస్ రాధే శ్యాం తో తప్పకుండా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడని అంటున్నారు. పూజా హెగ్దే కూడా ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని టాక్. సినిమాలో ఆమె అందానికి ఎక్కువ మార్కులు పడతాయని తెలుస్తుంది.

సినిమాలో ప్రభాస్ కు పర్ఫెక్ట్ పెయిర్ గా పూజా హెగ్దే ఉంటుందట. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. తప్పకుండా అందరి అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందని చెప్పొచ్చు. 2021 సమ్మర్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విక్రమాదిత్య ఫస్ట్ లుక్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.                                                                                      


మరింత సమాచారం తెలుసుకోండి: