సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని సిని ప్రియులకు ఉంది. ఇద్దరు ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఈ సినిమాల్లో అతడు హిట్ అవగా ఖలేజా మాత్రం అంచనాలను అందుకోలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి హ్యాట్రిక్ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమా లైన్ లో ఉంది.

అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ 2021లో ఎప్పుడన్నది చెప్పడం కష్టం. అందుకే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుని మహేష్ సినిమా గురించి రాజమౌళి ఆలోచిస్తాడు. కాబట్టి ఈలోగా మహేష్ త్రివిక్రం సినిమా చేస్తాడని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా చేస్తాడని అంటున్నారు. పోటీగా ప్రశాంత్ నీల్ సినిమా ఉన్నా ముందు త్రివిక్రం తోనే తారక్ సినిమా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ సినిమా పూర్తి చేశాక మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు త్రీవిక్రం. అంతేకాదు ఈసారి మహేష్ తో తీసే సినిమా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం, మహేష్ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని టాక్. మరి మహేష్ త్రివిక్రం కాంబో ఈసారి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చూడాలి.                                                                                                 

మరింత సమాచారం తెలుసుకోండి: