అయితే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ 2021లో ఎప్పుడన్నది చెప్పడం కష్టం. అందుకే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుని మహేష్ సినిమా గురించి రాజమౌళి ఆలోచిస్తాడు. కాబట్టి ఈలోగా మహేష్ త్రివిక్రం సినిమా చేస్తాడని అంటున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్.టి.ఆర్ త్రివిక్రం తో సినిమా చేస్తాడని అంటున్నారు. పోటీగా ప్రశాంత్ నీల్ సినిమా ఉన్నా ముందు త్రివిక్రం తోనే తారక్ సినిమా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
ఎన్.టి.ఆర్ సినిమా పూర్తి చేశాక మహేష్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు త్రీవిక్రం. అంతేకాదు ఈసారి మహేష్ తో తీసే సినిమా మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. త్రివిక్రం, మహేష్ సినిమాలో వెంకటేష్ కూడా నటిస్తాడని టాక్. మరి మహేష్ త్రివిక్రం కాంబో ఈసారి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందో చూడాలి.