అగ్ర హీరోలేమో పాన్ ఇండియా ఫీవర్ నుండి బయటకి రావట్లేదు. దీంతో ఆ నిర్మాతలు అందరూ టెన్షన్ లో ఉన్నాయి. బాహుబలి, సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా పాన్ ఇండియా వెనుక పాడడం మొదలుయింది. కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ తమను తాము నిరూపించుకోవాలన్న కసి, అందరు హీరోలలో పెంచింది.
తెలుగు-తమిళం-మలయాళం- కన్నడం- హిందీ ఆడియెన్స్ కి యాప్ట్ అయ్యే యూనివర్శల్ కథాంశాల్ని ఎంచుకునెందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టే బడ్జెట్లు విషయంలో మరీ గట్టిగా పెట్టుకుని నిర్మాణంలోకి దిగిపోయారు. అయితే అనుకోకున వచ్చిన కరోనాతో ఆ ఎఫెక్ట్ ని నిర్మాతలు ఫేస్ చేస్తున్నారు. నిర్మాతల బర్డెన్ ను పట్టించుకోకుండా భారీ బడ్జెట్ సినిమాలకి ప్లాన్ చేశారు. కరోనా కారణంతో ఒకవైపు సంక్షోభంలో కూరుకుపోయిన సినీ పరిశ్రమకు ఈ భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద తలనొప్పిగా మారి పో్యాయి.